తెలుగు
రాష్ట్రాల
రైతులందరూ
ఖరీఫ్
సాగు
మొదలు
పెట్టారు.
వర్షాలు
ఊపందుకోవడంతో
రైతుల్లో
ఉత్సాహం
ఉరకలెత్తుతోంది.
కలుపు
తీసేందుకు
కూలీలు
దొరకడం
గగనం
అవుతున్నది.
ఈ
పరిస్థితుల్లో
రసాయనాల
సాయంతో
కలుపును
ఎలా
నివారించాలో
వివరిస్తున్నారు..
దశాబ్దాలుగా
కలుపు
నివారణలో
పలు
పరిశోధనలు
చేసిన
ప్రొఫెసర్
ఎ.ఎస్.రావు.
వరిలో
ఇలా..
నారుమడిలో
ఊద
నిర్మూలనకు
ఎకరా
నారుమడికి
ప్రిటిలాక్లోర్
50 శాతం
ద్రావణం
400 మిల్లీలీటర్లను
200లీటర్ల
నీటిలో
కలిపి
నారుమడి
విత్తిన
2 లేక
3 రోజుల్లో
పిచికారీ
చేయాలి.
లేదా
వరి
విత్తిన
14, 15 రోజుల
సమయంలో
ఊద
నిర్మూలనకు
ఎకరా
నారుమడికి
సైహాలోపాప్
బ్యుటైల్
10 శాతం
ద్రావణం
400మిల్లీలీటర్లను
200లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేయాలి.
ఊద,
వెడల్పాకు
మొక్కలు
నారుమడిలో
సమపాళ్లలో
ఉన్నప్పుడు
నారుమడి
విత్తిన
15 రోజులకు
ఎకరాకు
80 మిల్లీలీటర్ల
బిస్పైరిబాక్
సోడియం
10 శాతం
ద్రవాన్ని
200 లీటర్ల
నీటిలో
కలిపి
పంటపై
చల్లాలి.
మాగాణి
వరిలో
ఊద
మొదలైన
ఏకవార్షిక
గడ్డిజాతి
మొక్కలు
ఎక్కువగా
ఉన్నప్పుడు
బ్యుటాక్లోర్
50 శాతం
ద్రావణం
1 నుంచి
1.5 లీటర్లు
లేదా
అనిలోఫాస్
30 శాతం
ద్రావణం
400మిల్లీలీటర్లు
లేదా
ప్రిటిలాక్లోర్
50 శాతం
ద్రావణం
400 మిల్లీలీటర్లలో
ఏదో
ఒక
దానిని
ఎకరాకు
20 కిలోల
పొడి
ఇసుకలో
కలిపి
నాటిన
3 నుంచి
5 రోజుల్లో
పలుచటి
నీరు
ఉన్నప్పుడు
సమానంగా
వెదజల్లాలి.
తుంగ,
గడ్డి,
వెడల్పాటి
ఆకుజాతి
మొక్కలు
సమపాళ్లలో
ఉన్నప్పుడు
ఎకరాకు
4 కిలోల
బ్యుటాక్లోర్
5 శాతం
ద్రావణం
గుళికలు,
4 కిలోలు
2,4-డి,
ఇథైల్
ఎస్టర్
4 శాతం
ద్రావణం
గుళికలు
20 కిలోల
పొడి
ఇసుకలో
కలిపి
నాటిన
3 నుంచి
5 రోజుల్లో
పలుచగా
నీరు
ఉన్నప్పుడు
సమానంగా
వెదజల్లాలి.
లేదా
ఎకరాకు
50 గ్రాముల
ఆక్సాడయార్జిల్
80 శాతం
పొడి
మందును
500 మిల్లీలీటర్ల
నీటిలో
కలిపి
ఆ
ద్రావణాన్ని
ఎకరాకు
20 కిలోల
పొడి
ఇసుకలో
కలిపి
నాటిన
3 నుంచి
5 రోజులలో
పలుచటి
నీరు
ఉన్నప్పుడు
సమానంగా
చల్లాలి.
నాటిన
25-30 రోజుల
సమయంలో
పొలంలో
వెడల్పాటి
కలుపుమొక్కలు
అధికంగా
ఉన్నప్పుడు
ఎకరాకు
400 గ్రాముల
2,4-డి
సోడియంసాల్ట్
80 శాతం
పొడిమందును
లేదా
ఇథాక్సి
సల్పురాన
15 శాతం
పొడిమందును
50 గ్రాములు
ఏదో
ఒక
దానిని
200 లీటర్ల
నీటిలో
కలిపి
కలుపుపై
పడేలా
పిచికారీ
చేయాలి.
పత్తిలో
నివారణ..
విత్తిన
వెంటనే
లేదా
1, 2 రోజుల్లో
పెండి
మిథాలిన
45 శాతం
ద్రావణం
ఎకరాకు
1 నుంచి
1.3 లీటర్లు
లేదా
అలాక్లోర్
50 శాతం
ద్రావణం
1.5 నుంచి
2 లీటర్లు
చొప్పున
ఏదో
ఒక
దానిని
200 లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేయాలి.
విత్తి
25, 30 రోజులప్పుడు
తర్వాత
50-55 రోజులప్పుడు
గొర్రు
లేదా
గుంటకతో
అంతరకృషి
చేయాలి.
ఖరీఫ్
వర్షాలు
ఎక్కువగా
ఉండి
అంతర
కృషి
కుదరనప్పుడు
ఎకరాకు
400 మిల్లీలీటర్ల
క్వైజాలాపాప్
ఇథైల్
5 శాతం
ద్రావణంతోపాటు
250 మిల్లీలీటర్ల
పైరిథయోబాక్
10 శాతం
ద్రావణం
200 లీటర్ల
నీటిలో
కలిపి
పత్తి
మొక్కలమీద
పడకుండా
వరుసల
మధ్య
కలుపు
మీద
మాత్రమే
పడేట్లు
స్ర్పే
చేసుకోవాలి.
వేరుశనగలో..
విత్తిన
వెంటనే
లేదా
1, 2 రోజుల్లో
పెండిమిథాలిన
30 శాతం
ద్రావణం
ఎకరాకు
1.3 నుంచి
1.6 లీటర్లు
లేదా
బ్యూటాక్లోర్
ద్రావణం
1.5 నుంచి
2 లీటర్ల
చొప్పున
ఏదో
ఒక
దానిని
200 లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేయాలి.
విత్తిన
20,25 రోజులప్పుడు
గొర్రుతో
అంతర
కృషి
చేయాలి.
అలాగే
మొక్కలు,
మొదళ్లకు
మట్టిని
ఎగదోయాలి
లేదా
గడ్డిజాతి
మొక్కల
నిర్మూలనకోసం
ఎకరాకు
250 మిల్లీలీటర్ల
పెనాక్సాప్రాప్
ఇథైల్
9 శాతం
ద్రావణం
200 లీటర్ల
నీటిలో
కలిపి
స్ర్పే
చేయాలి.
కందిలో..
విత్తిన
వెంటనే
లేదా
1, 2 రోజుల్లో
పెండిమిథాలిన
30 శాతం
ద్రావణం
ఎకరాకు
1 నుంచి
1.3 లీటర్ల
చొప్పున
200 లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేయాలి.
విత్తిన
30, 60 రోజుల
సమయంలో
గుంటకతో
కానీ,
గొర్రుతో
కానీ
అంతరకృషి
చేయాలి.
లేదా
ఎకరాకు
200 మిల్లీలీటర్ల
ఇమిజితాపిర్
10 శాతం
ద్రావణం
200 లీటర్ల
నీటిలో
కలిపి
స్ర్పే
చేయాలి.
మొక్కజొన్నలో..
ఎకరాకు
1 నుంచి
1.5 కిలోల
అట్రాజిన
50 శాతం
పొడిమందును
200 లీటర్ల
నీటిలో
కలిపి
విత్తిన
వెంటనే
లేదా
2,3 రోజుల్లో
భూమిపై
పిచికారీ
చేయాలి.
విత్తిన
30-35 రోజులప్పుడు
గొర్రు
లేదా
గుంటకతో
అంతరకృషి
చేసి
తర్వాత
బోదె
నాగలితో
సాళ్లు
చేసుకోవాలి,.
చెరుకులో...
ముచ్చెలు
నాటగానే
లేదా
2, 3 రోజుల్లో
అట్రాజిన
50 శాతం
పొడిమందును
ఎకరానికి
2 కిలోలు
200 లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేసి
ఒక
నెల
వరకు
కలుపు
నివారించుకోవచ్చు.
తోటనాటిన
నెల
తరువాత
20, 25 రోజుల
వ్యవధిలో
అవసరాన్ని
బట్టి
2, 3 సార్లు
గొర్రు
లేదా
దంతితో
అంతరకృషి
చేయాలి.
లేదా
వెడల్పాటి
కలుపుమొక్కలు
ఎక్కువగా
ఉంటే
2,4-డి
సోడియం
సాల్ట్
80 శాతం
పొడిమందు
500గ్రాముల
చొప్పున
30, 60 రోజుల
తర్వాత
పిచికారీ
చేయాలి.
లేదా
2, 4-డి
సోడియం
సాల్ట్
80శాతం
పొడిమందు
500గ్రాములు,
మొట్రిబుజిన
70 శాతం
పొడిమందు
అరకిలో
ఒక
ఎకరాకు
200 లీటర్ల
నీటిలో
కలిపి
వరుసల
మధ్య
మాత్రమే
పైరుపై
పడకుండా
30, 60 రోజులప్పుడు
స్ర్పే
చేస్తే
కలుపును
సమర్థంగా
నివారించవచ్చు.
సోయా
చిక్కుడు..
విత్తిన
వెంటనే
లేదా
1, 2 రోజులలో
పెండిమిథాలిన
30 శాతం
ద్రావణం
ఎకరాకు
1 ఉంచి
1.3 లీటర్లను
200 లీటర్ల
నీటిలో
కలిపి
పిచికారీ
చేయాలి.
విత్తిన
20, 25 రోజులప్పుడు
గొర్రుతో
అంతరకృషి
చేయాలి.
లేదా
విత్తిన
20 రోజుల
సమయంలో
ఇమిజాతాపిర్
10 శాతం
ద్రావణం
ఎకరాకు
250 మిల్లీలీటర్ల
మందును
200 లీటర్ల
నీటిలో
కలపి
స్ర్పే
చే
యాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి