వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే
చరిత్ర
ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.
హరిత విప్లవం
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణకు ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులనువాడి, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంధ్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది మొట్ట మొదటి సారిగా మెక్సికో లో 1945 లో ప్రారంభమైంది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారమందించాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది.
భారతదేశంలో
మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్పూర్తిగా తీసుకుని రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది. 1961 లో భారతదేశం లో విపరీతమైన క్షామం ఏర్పడింది. అప్పటి భారతదేశపు వ్యవసాయశాఖా మంత్రియైన ఎం.ఎస్.స్వామినాథన్ సలహాదారు నార్మన్ బోర్లాగ్ ను భారతదేశానికి ఆహ్వానించారు. భారతదేశ ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ గోధుమలను మెక్సికో ప్రయోగశాల నుంచి దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. దాంతో భారతదేశంలో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది.
ఎం.ఎస్.స్వామినాథన్, పి.సుబ్రమణ్యంలను భారతదేశపు హరిత విప్లవ పితామహులుగా అభివర్ణిస్తారు.
హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని పంజాబ్,హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది.
భారతదేశంలో వ్యవసాయం
భారతదేశంలో పంట కాలాన్ని మూడు విధాలుగా వర్గీకరించారు. అవి
- ఖరీఫ్ పంట కాలం : జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్క జొన్న, పత్తి,చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరు శనగ.
- రబీ పంటకాలం : అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు సాగయ్యే పంటలు - గోధుమ, బార్లీ, మినుములు, ప్రొద్దు తిరుగుడు, ధనియాలు, ఆవాలు మొదలైనవి.
- జైద్ పంటకాలం : మార్చి నుంచి జూన్ వరకు సాగయ్యే పంటలు - పుచ్చకాయలు, దోస కాయలు, కూరగాయలు, మొదలైనవి.
వ్యవసాయ పనులు
- దుక్కి దున్నడం:పంటపండించే ముందు, సరైన కాలంలో దుక్కి దున్నడం, మొట్టమొదటి సారిగా చేసే వ్వసాయపు సాగు పని. దీనివల్ల అనేక లాభాలున్నాయి. నేలను దున్నడం వల్ల నేల గుల్లబారి, మెత్తగా ఉంటుంది. అటువంటి నేలలోకి నీరు పారిస్తే భూమిలోకి ఇంకి, అన్ని వైపులకూ ప్రవహిస్తుంది. నేల మెత్తగా ఉంటే దాని ఉపరితల వైశాల్యం పెరిగి ఆ నేలలో ఎక్కువ నీటి నిలుపుదలకు సహాయపడుతుంది. ఈ నీటిని మెక్కలు పీల్చుకుంటాయి.
- భూమిని చదునుచేయడం:పొలంలోని మట్టిగడ్డల వలన నేల ఎగుడుదిగుడుగా ఉంటుంది. దానివల్ల ఆనేలలో విత్తనాలు జల్లడానికి, నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు. నేలను చదును చేయడం వల్ల నీరు, పోషక పదార్థాలు సమానంగా సర్దుబాటు అవుతాయి. పొదుపుగా లాభసాటిగా నీరు ఉపయోగించడానికి నేల చదునుగా ఉండాలి.
- ఎరువులు వేయడం:
- నీరు పెట్టడం:
- దమ్ము చేయడం:
- చదునుచేయడం:
- విత్తడం:విత్తనాలు విత్తే ముందు రైతులు ఏ వ్యాధిలేని విత్తనాలు ఎంపిక చేస్తారు. దీనివల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది.
- నారు నాటడం లేదా ఊడ్చడం:
- దారులు చేయడం:
- కలుపు మొక్కల్ని తొలగించడం: పొలాల్లో సాగు మొక్కలతోపాటు నేల, నీరు, పోషక పదార్థాలు వెలుతురుకూ పోటీ పడుతూ పెరిగే మనకు అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు.
- నీటి పారుదల: మొక్కల పెరుగుదలకు, పంటల ఉత్పత్తులకూ నీరు చాలా అవసరం.
- ఎరువులు:ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపధార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి.
రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్న పరచి సహజ ఎరువులను తయారు చేస్తారు.
- పురుగు మందులు చల్లడం:
- పంట కోయడం:
- కోసిన పంటని ఎండబెట్టడం:
- కట్టలు కట్టడం:
- కుప్ప వేయడం:
- నూర్చడం లేదా ధాన్యాన్ని వేరుచేయడం:
- తూకం, బస్తాలు నింపడం:
వ్యవసాయ పనిముట్లు
వీటిలో మొదటిగా చెప్పుకో దగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసినది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుము తో చేసినది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ చాల వరకు తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడ వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు.
వరి కోతకు, ఇతర సన్నని పంటలను కోయ డానికి ఉపయోగిస్తారు. అలాగే పశువుకు గడ్డి కోయడానికి ఉవయోగిస్తారు. ఇది చిన్న కత్తి లాగె వుండి వంపు వైపు సన్నని రంపపు వళ్లు లాంటి పళ్లు కలిగి వుంటుంది. దానిని కక్కు అంటారు. కాలానుగుణంగా ఆ కక్కు అరిగి పోతుంటే మాటి మాటికి దానికి కక్కు వేస్తారు. కొంత కాలం తర్వాత అది చిన్నదై పోతుంది. ఆ చిన్నదైన కొడవలిని లిక్కి అంటారు. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అది... ఉంటే లిక్కి పోతె కొడవలికొడవలి కత్తికన్నా చాల తేలికైన సాధనము. కొన్ని ప్రాంతాలలో కత్తిని కూడ కొడవలి అని అంటారు. ఉదహరణకు.... "వేట కొడవలి.
కత్తులు చాల రకాలు. చిన్న కత్తి చిన్న పనులకు, అనగా చిన్న కొమ్మలు కొట్ట డానికి, చెరుకు కొట్టడానికి, వాడుతారు. పెద్ద కత్తి: దీన్ని పెద్ద కొమ్మలు కొట్ట డానికి ఉపయోగిస్తారు. వేట కత్తి: దీన్ని వేటను నరక డానికి, లావు పాటి కొమ్మలను నరకడానికుపయోగిస్తారు. వీటికి పదునెక్కువ.
ఇది చిన్నకత్తికన్న తేలికగా వుండి దానికన్నా ఎక్కువ వంపు కలిగి వుండి, దానికి పిడి బదులు అక్కడ ఒక గొట్టం లాగ వుంటుంది. అందులో పొడవాటి వెదురు కర్రను దూర్చి వుంటుంది. దీన్ని గొర్రెల కాపరులు, మేకల కాపరులు వెంట తీసుకెళ్లి చెట్ల పైనున్న కొమ్మలను కోసి వారి జీవాలకు మేత వేస్తారు. దీనికి పదునెక్కువ. ఇది తెలికైన ఆయుదము.
చిన్నగొడ్డలి .. పెద్ద గొడ్డలి రెండు రకాలు. చిన్న దాన్ని చిన్న పనులకు, పెద్ద దాన్ని పెద్ద పెద్ద మానులను నరకడాని కుపయోగిస్తారు. గొడ్డళ్లకు పదును ఎక్కువగా వుండదు. గొడ్డలి సంబందించిన సామెత: గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
- [[ తొలిక
మెట్ట పైర్లలో కలుపు తీతకు, వేరుశనగ కాయలు త్రవ్వడానికి, మొదలగు వాటికి వాడు తారు.
- గుద్దలి
దీనితో భూమిలో వున్న చెట్లను వేళ్లతో సహా పెకలించ డానికి వాడే గొడ్డలి లాంటి పరికరము.
చిలుకు దోటి తో చెట్టు పైనున్న చింత కాయలు, మునగ కాయలు మొదలగు వాటిని కోసి కింద పడ వేయ డానికి ఉపయోగిస్తారు. పైనున్న కొమ్మకు తగిలించి వూపి దానిలోని కాయలను రాల్చడానికుపయోగిస్తారు.
- చిక్కం దోటి
ఇది చిలుకు దోటి లాంటిదే. కాని దీనికి చివరన ఒకచిన్న చక్రం లాంటిది వుండి దానికి చిన్న వల వుంటుంది. దీన్ని చెట్లపై నున్న మామిడి కాయలను కోయ డానికి వాడతారు. మామిడి కాయలను చిలుకు దోటితో కోస్తే అవి కింద పడి దెబ్బలు తగిలి పాడవుతాయి. ఈ చిక్కంతో కోస్తే కాయలు ఆ చిక్కంలో (వలలో) తగులుకొని కింద పడవు. మెల్లిగా క్రిందికి దించి కాయలను తీసు కుంటారు.
- పార
మట్టిని తట్టల కెత్త డానికి, అడుసులో అండ చెక్కడానికి, గట్టులు వేయడానికి, పొలాలకు, చెరుకు తోట వంటి తోటలకు నీరు కట్టడానికి పార చాల అవసరం. కాల క్రమంలో పార అరిగిపోయి చిన్నదైతె దాన్ని గొనంపార అంటారు.
- తొలికి దీనిని మెట్ట పైర్లలో కలుపు తీయడానికి, వేరుశనగ కాయలను త్రవ్వి తీయడానికి ఉపయోగించే చిన్న పరికరము.
- గడ్డ పార/ గునపం
మట్టిని త్రవ్వడానికి, పొలాల్లో రాళ్లను పెకలించ డానికి దీని వుపయోగం చాల వున్నది. కపిలి, గూడ, ఏతం, ఎద్దుల బండివీటికి కావలసిన పరికరాలు అవి పని చేసె విధానం ప్రత్యేకంగా ఆయా వర్గాలలో వివరించ బడ్డాయి. మంచె జొన్న, సజ్జ చేలలో మధ్యలో కర్రలతో ఎత్తైన వేదిక వేసి దానిపైకెక్కి కంకులపై వాలె పక్షులు, పిట్టలను తోలదానికి ఏర్పాటు చేసుకున్న సుమారు అయిదారు అడుగుల ఎత్తైన కర్రల వేధిక.
అరచేతి వెడల్పు తో అదే పరిణామంలో దారాలతో అల్లిన వల. ఆ వల రెండు చివరలన రెండు పొడవాటి దారాలు వుంటాయి. మధ్యలో ఒక రాయిని పెట్టి రెండు దారాల కొసలను చేర్చి కుడి చేత్తో పట్టుకొని తలపి గిర గిరా వేగంగా తిప్పి ఒక దారం కొసను వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్ళి పడుతుంది.పొలాల్లో పక్షులను తోల డానికి దీన్ని వాడతారు. కాని దీన్ని గురి చూసి కొట్ట డానికి లేదు. పూర్వం వడిసెలను యుద్దాలలో కూడ వాడినట్లు ఆదారాలున్నాయి. నైజాం సర్కారు పై ప్రజాపోరులో పాడిన పాట: బండెనక బండి కట్టి పదహారు బండ్లు గట్టి ... ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ ......................, ............ వడిసేల రాయి పెట్టి వడి వడి గా కొట్టి తేను నీ మిల్ట్రి పారి పోయె రో నైజాము సర్కరోడా ............................,
ఆకు తోటలో తమలపాకులు కోయడానికి బొటన వేలుకి వేసుకునే ఇనుప రేకు గోరు. దీని వలన వేళ్లకు నొప్పి లేకుండా వుంటుంది.
ఇది కొబ్బరి లేదా వెదురు పుల్లలతో అల్లిన చేపలు పట్టే.... పరికరం.
ఇది కూడ చేపలు పట్టడానికుపయోగించే చిన్న ఇనుప కొక్కెం.
- సూది ఇది బట్టలను కుట్టుకునే సాదారణ పరికరం.
ఇది సూది లాంటి పెద్ద పరికరం. దీతో పెద్ద గోతాలలొ దాన్యం వేసి నపుడు దాని మూతిని కుట్టడానికి వుపయోగిస్తారు.
ఎద్దుల బండి తోలె టప్పుడు జాటీ తో ఎద్దులను అదిలిస్తుంటాడు. ఇది సన్నని వెదురు కర్రకు తోలుతొ అల్లిన దారం కలిగి, కొసలో జానెడు పొడవున్న మూడు తోలు పోగులు వుంటాయి. ఇది ఆతి చిన్న కొరడా లాంటిది. దీని దెబ్బ చాల చురుక్కు మంటుంది.
ఇది సన్నని వెదురు కర్ర. దాని చివరన కొసగా చెక్కి వుంటుంది. దీన్ని దుక్కి దున్నేటప్పుడు ఎద్దులను అదిలించ డానికి వాడుతారు.
కాడిమాను ఇది కొయ్యతో చేసినది. దీన్ని ఎద్దుల మెడపై వేసి బండికి.... నాగలి వంటి పనిముట్లుకు కట్టి ఎద్దులతో పని చేయించడానికుపయోగిస్తారు. ఎద్దులతో ఏ పని చేయించాలనా ఎద్దుల మెడపై కాడి మాను పెట్టాల్సిందె. కాడి మాను పైకి లేపగానె ఎద్దులు తలలు వంచి దాని కిందికి దూరి కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి.
ఇది నాలుగడుగులు పొడవున్న కర్ర దుంగ. దానికి సుమారు పది రంద్రాలు చేసి దానికి ఒక జానెడు పొడవున్న కర్ర ముక్కలను బిగించి వుంటారు. దీన్ని వెలి దుక్కి దున్నిన తర్వాత ఆ సాళ్లలొ ఏదేని విత్తనాలు వేసిన ఆ సాళ్లను పూడ్చడానికి వాడతారు.
పందిలి పైనున్న గడ్డిని, తీయడానికి, చిన్న చెట్లను ఎక్కడానికి దీనిని ఉపయోగిస్తారు.
కాడి ఎద్దులు అంటే రెండు ఎద్దులు. కుడి పక్కది, ఎలపట.. ఎడం పక్కది దాపట అని అంటారు.. ఎద్దులు ఎప్పుడు దుక్కి దున్ను తున్న, బండి లాగుతున్న, లేదా రోడ్డు మీద నడుస్తున్న. పనిలో వున్నప్పుడు ఇంటి వద్ద కొట్టంలో కట్టేసి వుంచినా అవి ఆ వరుసలో మాత్రమె వుంటాయి. కుడిది ఎడం పైపుకు గాని అటుది ఇటు గాని వుండవు. చ్చో అంటే ఎలపటది, టుర్ ర్ ర్అంటే దాపటది తిరుగు తాయి. వంపు తిరగ టానికి ఈ మాటలను వాడతారు. దుక్కి దున్నేటప్పుడు ఒక సాలు అయిన తర్వాత దాని పక్కనే ఇంకో సాలు దున్నాలి. అలా దున్నాలంటే సాలు చివరన ఎద్దులను తిప్పి సరిగా ఆ సాలు వెంబడే ఇంకో సాలు దున్నాలి. ఇది కొంత ఆలస్యం అవుతుంది. అందు చేత సాలు చివరన ఎద్దులను ఇంకొంత దూరం సుమారు పది అడుగులు పక్కకు పోనిచ్చి అక్కడ ఇదివరకు దున్నిన సాలుకు సమాంతరంగా ఇంకో సాలు దున్నుతారు. దాన్ని కొండ్రఅంటారు. ఆ కొండ్ర చివరన ఎద్దులను మలిపి ఇదివరకు దున్నిన సాలు వెంబడి సాలు వేస్తారు. ఆ కొండ్ర పూర్తి కాగానె ఇంకో కొండ్ర వేస్తారు. రోజలు మారాయ్ అనె పాత సినిమాలో వ్వవసాయానికి సంబందించిన పదాలు ఒక పాటలొ కొన్ని వున్నాయి. అది....... ఏరు వాక సాగారో ... రన్నో ..... చిన్నన్న........ నీ కష్టమంతా తీరెను రో రన్నో చిన్నన్న.. ఎలపట దాపట ఎడ్ల కట్టుకొని, ఇల్లాలిని నీ వెంట బెట్టుకొని, ,,,,,,,, సాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో....... ఏరువాక సాగారోరన్నో చిన్నన్న.....
రైతులకు ఇది అతి ముక్యమైన సాధనము. పొలములోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటి వద్దనున్న దిబ్బలోని ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముక్యమైన సాధనం. దీనిని వడ్రంగి తయారు చేస్తాడు. రెండెడ్లతో నడిచే ఈ బండి కాలాను గుణంగా మార్పులు చెందుతూ టైరు చక్రాలతో నడిచే విధంగా రూపు దిద్దుకొన్నది. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవి గూడు బండి, సవారి బండి. వీటిని సంతలకు సరకులను రవాణ చేయడానికి, మనుషులను రవాణాకు వాడె వారు. ఒంటెద్దు బళ్లు కూడ వుండేవి. గూడు బళ్లు, సవారి బళ్లకు ఏ నాడో కాలం చెల్లి పోయింది. మామూలు ఎద్దుల బండ్లు మాత్రం అరుదుగా అక్కడక్కడా కనిపిస్తున్నాయి, వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. ఇవి ఎద్దులు చేసె అన్ని పనులు చేస్తున్నాయి. పైగా అతి వేగంగా పని జరుగుతున్నది.
ఇప్పుడైతే పొలానికి కూడ అన్నం టిపన్ క్యారియర్లలో తీసుకెళ్లు తున్నారు కాని గతంలో సంగటి ముద్దను అడవులకు/ పశువులును /గొర్రెలను/ మేకలను కాయడాని వెళ్లేటప్పుడు చిక్కంలో తీసుకెళ్లే వారు. ఇది సన్నని దారలతో అల్లిన చిన్న వల. గొర్రెల కాపరులు, మేకల కాపరులు మొదలకు వారు అడవికి వెళ్లే టప్పుడు సంగటి ముద్దను వేసుకొని అందులో చింతకాయ ఊరి బిండిని వేసుకొని మధ్యాహ్నాం తినడానికి ఆ చిక్కాన్ని సంకకు తగిలించుకొని తీసుకెళ్లే వారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ చిక్కం నిండా వులింజి పండ్లు, బూడిగ పండ్లు, రేగి పండ్లు, కలింకాయలు వంటి అడవి పండ్లను తీసుకొని వచ్చెవారు. గొర్రె పిల్లలు వాటి తల్లుల కొరకు, ఊరి పిల్లలు వారు తెచ్చే పండ్లకొరకు ఊరి బయటే ఎదురు చూసే వారు.
సాధారణంగా ప్రతి మొగ వారి వద్ద మొల తాడుకు కట్టిన చిన్న వస్తువులు కలిగిని ఒక గుత్తి వుండేది. అందులో గీస కత్తి: ఇది చాల చిన్నని కత్తి: గుబిలి గంటె ..... ఇది చెవులో గుమిలి తీయ డానికి వుప యోగ పడేది: మల్లె ముల్లు: ... దీంతో కాలిలో గుచ్చు కున్న ముల్లును తీయ డానికి ఉపయోగించే వారు. వీటిని అత్యవసర పరికారలుగా చెప్ప వచ్చు. ప్రస్తుతం ఇటు వంటివి ఎవరి వద్దా లేవు. కాని దానికి పోలిన ఇంకా ఎక్కువ చిన్న పరికారాలున్న గుత్తి పట్టణాలలో విరివిగా దొరుకుతున్నాయి. అందులో గోర్లు తీయ డానికుపయోగించేది మొదలగు నవి వున్నాయి.
విద్య
పాలిటెక్నిక్
ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము వ్యవసాయంలో రెండేళ్ళ డిప్లొమా కోర్సులు అందజేస్తున్నాయి. 10 వ తరగతి 55శాతం(హింది మినహాయించి) తో , 1-10 తరగతులలో నాలుగు సంవత్సరాలు గ్రామాలలో చదివి, 15-22 సంవత్సరాల వయస్సుగల అభ్యర్థులు వీటికి అర్హులు. బోధన తెలుగులో వుంటుంది.
డిగ్రి
ఎమ్సెట్ పరీక్ష ద్వారా రకరకాల సైన్స్ , ఇంజనీరింగ్ కోర్సులు వున్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సులు:
- బిఎస్సి (వ్యవసాయం), బిఎస్సి (ఉద్యానవనం), బివిఎస్సి మరియుపశుగణాభివృద్ధి, బిఎస్సి (వాణిజ్య వ్యవసాయం, వ్యాపార నిర్వహణ) ,బిఎఫ్సి,
- బిటెక్ (జీవసాంకేతిక శాస్త్రం), బిటెక్ (ఆహార విజ్ఞానం మరియు సాంకేతికం), బిటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్) ,బిటెక్ (పశుపోషణ)
మూలం:
---------------------------------------------------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ పథకాలు:


Website Access is Denied . Please contact website coordinator/administrator - this line appearing on every icon i tried to open. Are you under process of content developing or is there any website issue. pls check
రిప్లయితొలగించండి