పంటపొలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంటపొలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2016, సోమవారం

51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్థిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిన 51గ్రామాలు, రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. విజయాలన్నీ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్ఒరేన్అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.

నేను పురస్కారాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పల్లెల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించాలి’... తనకు దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించినప్పుడు సైమన్అన్న మాటలివి. దిల్లీలో పురస్కారం అందుకోవడానికి వచ్చిన ప్రముఖల కోసం ఫైవ్స్టార్హోటల్లో గదులని కేటాయిస్తే, వాటిని వద్దని గిరిజన సంక్షేమ హాస్టల్లో బస చేశాడు సైమన్‌. ‘నా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే, నేను విలాసాలను అనుభవించలేనుఅన్నది ఆయనిచ్చిన సమాధానం. జార్ఖండ్లోని బీడో జిల్లా కక్సిటోలి గ్రామంలో పుట్టిన సైమన్‌, రాష్ట్రపతి భవనం దాకా రావడానికి మధ్యలో మార్చిన జీవితాలూ, సాధించిన విజయాలూ చాలా ఉన్నాయి.

నీటి కష్టాలు మొదలు... 
సైమన్స్వగ్రామం అటవీ ప్రాంతం. చిన్నప్పుడు దళారులు యంత్రాలతో చెట్లను నరుకుతుంటే చూడ్డానికి సైమన్సరదా పడేవాడు. అంత భారీ యంత్రాలు ఒక్క దెబ్బకు చెట్లను నేలకూల్చడం అతడికి ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త పెద్దయ్యాక కానీ అతడికి అర్థం కాలేదు, దళారులు నాశనం చేస్తోంది అడవుల్ని కాదు తమ జీవితాల్నీ అని. చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రాంతంలో నేలపైన సారవంతమైన పైపొర కొట్టుకుపోయి, భూములన్నీ నిస్సారంగా మారాయి. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైంది. నెమ్మదిగా వలసలూ, ఆకలి చావులూ, ఆత్మహత్యలూ మొదలయ్యాయి. దైవంలా చూసుకునే అడవిలోని చెట్లని కొట్టి అమ్ముకొని గ్రామస్థులు పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సైమన్ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అన్ని ఇబ్బందులకూ కారణం నీటి కరవే. వర్షాకాలంలో కురిసే వానలే అక్కడ నీళ్లకు ఆధారం. వాటిని భద్రపరచుకోగలిగితే నీటి కొరతను కొంత వరకూ జయించొచ్చని అనుకున్నాడు

కష్టాలకుచెక్‌’డ్యామ్లు... 
వానాకాలంలో నీటిపాయలు కొండల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయేవి. సైమన్ నీటిధార ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి కొన్ని మైళ్ల దూరం నడిచాడు. వర్షపు నీళ్లు అడవిలో, కొండలపైన ఎక్కువగా నిలుస్తోన్న ప్రాంతాలను గుర్తించాడు. వాటి పరిసరాల్లో చెక్డ్యామ్లు నిర్మించి, నీటిని కుంటల్లోకీ, పొలాల్లోకీ మళ్లిస్తే నీటి సమస్య తగ్గుతుంది అనిపించింది. కానీ దానికోసం గ్రామస్థుల పొలాల్లో కొంత భాగం మునిగిపోతుంది. దాంతో చాలామంది డ్యామ్ నిర్మాణానికి ఒప్పుకోకపోవడంతో, సైమన్తన పదెకరాల పొలాన్నీ ముంపు బాధిత రైతులకు ఇచ్చేశాడు. కొందరు కుర్రాళ్ల సాయంతో వర్షపు నీటి ప్రవాహాలకు అడ్డంగా మట్టితో చెక్డ్యామ్లు నిర్మించి నీటిని బావులవైపు మళ్లించాడు. తొలి రెండేళ్లూ వర్షాల ధాటికి డ్యామ్లు కొట్టుకుపోయాయి. దాంతో మూడో ఏడాదికి అధికారుల కాళ్లావేళ్లా పడి కాంక్రీట్డ్యామ్లు నిర్మించాడు. వాటి ఆధారంగా గ్రామ చుట్టుపక్కలున్న బావులూ కుంటల్లోకి వర్షపు నీరు చేరేలా కాల్వలు ఏర్పాటు చేశాడు. కొత్తగా చెరువులు తవ్వించాడు. క్రమంగా భూగర్భ జల మట్టం పెరిగింది. పొలాలు వ్యవసాయానికి అనువుగా మారాయి. విజయం ఇతర గ్రామాలనూ ఆకర్షించి వాళ్లూ సైమన్ను ఆశ్రయించారు. అలా ఒక్కో గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టిన సైమన్‌, కొన్నేళ్ల వ్యవధిలో జిల్లాలోని 51 గ్రామాల్లో నీటి కరవును దూరం చేశాడు.గ్రామాలు మారిపోయాయి 
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమేనని సైమన్కి తెలుసు. అందుకే కుర్రాళ్లను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశాడు. గతంలో చెట్లను నరికేసిన ప్రాంతంలో 35వేలకు పైగా చెట్లను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఫలితంగా నేల సారవంతమైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంటే వేస్తే, 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితో సహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఆత్మహత్యలూ, వలసలూ తగ్గి చాలా కాలమైంది. తొలిసారి పిల్లలు మంచి స్కూళ్లకెళ్లి చదువుకుంటున్నారు. గ్రామాల నుంచి లక్షలు విలువ చేసే 20వేల మెట్రిక్టన్నుల కూరగాయలు ఏటా గుజరాత్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో బీడోని అక్కడి ప్రభుత్వంఅగ్రికల్చరల్హబ్ఆఫ్జార్ఖండ్‌’గా గుర్తించింది. సైమన్ను వాటర్షెడ్ల కార్యక్రమానికి బ్రాండ్అంబాసిడర్గా నియమించింది. అతడి ప్రస్థానంపైన సారా అనే కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిని పీహెచ్డీ చేసింది. వృద్ధాప్యం మీదపడినా ఇప్పటికీ సైమన్ఏటా వెయ్యి మొక్కలను నాటడంతో పాటు వాటి బాగోగులనూ చూసుకుంటున్నాడు

సైమన్లా ఇబ్బందులు ఎదుర్కొన్నాక పరిష్కారాన్ని వెతుకుతామా, లేక అజాగ్రత్త వల్ల ఎదురయ్యే సమస్యలను ముందే వూహించి వాటిని నివారించడానికి మనవంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తామా అన్నది మన చేతుల్లో పనే కదా..!

12, ఆగస్టు 2016, శుక్రవారం

పంటపొలంలో మరో విప్లవం!

దేశంలో మార్పు తేవడానికి ఎన్ని మహత్తరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటి ఫలితాలను అంతిమ వ్యక్తికి అందించలేకపోతే మనం విఫలమైనట్టే’- ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. దేశ వ్యవసాయ రంగానికి వ్యాఖ్య అతికినట్టు సరిపోతుంది. గడచిన 69 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వాలు అధికారం చేపట్టినా, సగటు రైతు జీవన స్థితిగతుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదు. స్వాతంత్య్రానంతరం వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, వాటి ఫలితాలను అంతిమ లబ్ధిదారులైన చిన్న, సన్నకారు రైతులకు అందించలేకపోవడమే వైచిత్రి.

పెనుమార్పులు 
స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించింది. హరిత విప్లవం కారణంగా దేశ వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. సంప్రదాయ సేద్యం ఒక్కసారిగా ఆధునిక రూపు సంతరించుకుంది. ముఖ్యంగా వరి, గోధుమ పంటల్లో హరిత విప్లవం పెను మార్పులనే తెచ్చింది. పంటల సరళి అనూహ్యంగా మారింది. ఉత్పత్తి, ఉత్పాదకతల్లో కదలిక మొదలైంది. యాంత్రీకరణ విస్తరించడంతో సేద్య పనుల్లో వేగం పెరిగింది. ఆధునిక వ్యవసాయానికి అంకురార్పణ జరిగింది. వరి, గోధుమ పంటల్లో సంప్రదాయకంగా రైతులు వూహించని విధంగా రెట్టింపు దిగుబడులు సాధ్యపడ్డాయి. హరిత విప్లవం వచ్చాక అధిక దిగుబడుల కోసం సంప్రదాయకంగా వాడే పశువుల పేడ స్థానే రసాయన, క్రిమిసంహారకాల వాడకం పెరిగింది. ఇది దిగుబడుల్ని ప్రభావితం చేస్తుండటం రైతుల్ని ఆకర్షించింది. సంప్రదాయ పద్ధతులకు తిలోదకాలివ్వడం అప్పుడే మొదలైంది. పొడుగు రకాల పంట స్థానంలో పొట్టి విత్తనాలు వచ్చాయి. ఉత్పత్తి రెట్టింపు కావడం రైతుల్లో ఆశలు రేకెత్తించింది. పక్క రైతును చూసి పోటాపోటీగా రసాయనాలు వాడే దుస్థితీ దాపురించింది. ఫలితంగా సేంద్రియ పదార్థం అందక నేలలు అవి గిడసబారడం మొదలైంది. ప్రకృతి వనరులిలా కలుషితమవడం, ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి ఉండటం ఎక్కువైంది. ఎలాంటి అవగాహన లేకుండా వీటిని ఉత్పత్తి చేస్తూ వచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలు అమలులోకి వచ్చాక, సంపన్న దేశాలు రసాయన అవశేషాలనే సాకుగా చూపి, పేద దేశాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకొనేందుకు నిరాకరిస్తూ వచ్చాయి. భారత్విషయంలోనూ ఇలాగే జరిగింది. అవి తమ ఉత్పత్తుల్ని మనకు విరివిగా ఎగుమతి చేయగలుగుతున్నాయి కానీ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మనం దేశాలకు ఎగుమతుల్ని పెంచుకోలేకపోతున్నాం. గడచిన 69 ఏళ్లలో మన పప్పు ధాన్యాల సగటు ఉత్పాదకత హెక్టారుకు 441 కిలోల నుంచి 691 కిలోలకు మాత్రమే పెరగగలిగిందంటే మన పరిశోధనలు, వాటి కేటాయింపులు ఎటు పోతున్నట్లు? హరిత విప్లవం కొన్ని పంటలకే, ముఖ్యంగా వరి, గోధుమ వంటి పంటలకే పరిమితమైందనే అపవాదు లేకపోలేదు. సంప్రదాయ పంటలైన జొన్న, సజ్జ, కొర్ర, రాగులతోపాటు పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటలకు ఆదరణ తగ్గింది. పంటల విస్తీర్ణం క్షీణించడంతోపాటు ప్రజల్లో వాటి వినియోగం సైతం తగ్గడంతో మన ఆహారంలో పోషకాహార స్థాయి పడిపోయింది. అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లాయి. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసింది. హరిత విప్లవంతో సాధించిన ప్రగతి కొన్ని రంగాలకే పరిమితం కాగా, అది తెచ్చిన అనర్థాలు విస్తృతస్థాయిలో నష్టపరచాయి. హరిత విప్లవం తరవాత దేశం ఆహారోత్పత్తుల్లో స్వావలంబన సాధించిన మాట నిజమే కానీ, అదే సమయంలో రైతుల ఆదాయాలూ మరింత క్షీణించాయి. దేశానికి ఆహార ధాన్యాలు అందించే రైతులు ఒకపూట తిండికి నోచుకోలేని పరిస్థితులు దాపురించాయి. ఆహారభద్రత చట్టం తీసుకొచ్చినా, లక్ష్యాల సాధనకు కీలకమైన అంశాలను ప్రభుత్వాలు విస్మరిస్తుండటం శోచనీయం. ఎంతసేపూ ఉత్పత్తి-పంపిణీ గురించే తప్ప, ఉత్పత్తి సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రద్ధ పెట్టడం లేదు!
గ్రామస్థాయిలో విస్తరణ యంత్రాంగం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపం. మన అవసరాలెంత, ఎంత పండించాలి, మేరకు పండిస్తే ఎంతెంత ధరలొస్తాయని చెప్పేవారే లేరు. గ్రామీణ రైతు స్థాయికి సాగు సలహాలందడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలూ రైతుకు దక్కడంలేదు. పంట నూర్చినప్పుడు ధరలు పడిపోతాయి. కొద్ది నెలల తరవాత మళ్ళీ పెరుగుతాయి. తెచ్చిన అప్పులు తీర్చేందుకు 80 శాతం రైతులు కల్లాంలోనే పంటను తెగనమ్ముకుంటున్నారు. లాభమంతా వాటిని కొనిపెట్టుకున్న వ్యాపారులకు చేరుతోంది. ఇలా అన్నింటా దోపిడిపర్వంతో దేశంలో అత్యధికశాతం రైతులు అప్పుల వూబిలో కూరుకుపోయారని జాతీయ సర్వేలు తేల్చి చెప్పాయి. ఏడేళ్ల క్రితం 2009-10లో క్వింటా వడ్లు ఉత్పత్తి చేయాలంటే రూ.645 ఖర్చయ్యేది. 2015-16 నాటికది రూ.1,324కు పెరిగింది. నేటికి క్వింటా వడ్లకు మద్దతు ధర రూ.1,410కి మాత్రమే చేరింది. ఇదంతా ప్రభుత్వ లెక్క. వాస్తవ ఖర్చులు ఇంకెంతో ఎక్కువ. విధంగా చూసినా చూసినా ఖర్చుకు, ఆదాయానికి పెద్ద వ్యత్యాసం లేదన్న సంగతి సుస్పష్టం. కొన్ని పంటల సాగులో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, అవే పంట ఉత్పత్తుల్ని సొంత అవసరాలకోసం చిన్నచిన్న దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడటం దారుణం. పరిస్థితుల్లో ఉత్పత్తులు పెంచడంతోపాటు, వాటికి విలువ జోడించడమూ అత్యంత కీలకం. అందుకు తగిన అవకాశాలను కల్పించాల్సి ఉంది. దిశగా రైతుల వద్దకు వెళ్లి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నారు. రాష్ట్రాలవారీగా వివిధ పంటల్ని అధికంగా పండించే ప్రాంతాలను గుర్తించి, వాటిని క్లస్టరుగా విభజించి విలువ జోడింపు పరిశ్రమలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృతంగా ఏర్పాటయ్యేలా చూడాలి. ఇటీవలి కాలంలో విద్యాధికులు కొత్తగా సేద్యంలోకి దిగుతున్నారు. కానీ, వీరి సంఖ్య స్వల్పమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేద్యం పట్ల మమకారం పెరగాలంటే వ్యవసాయ సంస్కరణలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతులు నిలదొక్కుకునేందుకు అవి దోహదపడాలి. పాలకుల మాటలు చేతలుగా రూపాంతరం చెందితేనే ఫలితం ఉంటుంది.

పంట నష్టపోతే పాడి ఆదుకుంటుంది. కవ్వమాడిన ఇంట కాసులకు లోటుండదనే నానుడిని నేడు రైతులోకం విస్మరిస్తోంది. దీనికి పాలకులూ బాధ్యులే. స్వాతంత్య్రానంతరం నీలి విప్లవం సాధించాం, శ్వేత విప్లవం ఫలితాలనూ అందుకున్నాం. పాల ఉత్పత్తి 1990-91లో 5.39 కోట్ల టన్నుల నుంచి 2014-15నాటికి 14.63 కోట్ల టన్నులకు చేరింది. మేలుజాతి పశుపోషణ రైతులకు భారంగా పరిణమించింది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ, సగటు ఉత్పాదకతలో ఇజ్రాయెల్‌, బ్రెజిల్వంటి దేశాలతో పోల్చితే ఇండియా అట్టడుగున ఉంది. రోజుకు 50 లీటర్లకు పైగా పాలిచ్చే జాతులతో దేశాలు సుసంపన్నం అవుతుంటే భారత్లో 25 లీటర్ల స్థాయినైనా అందుకోలేకపోతున్నారు. పాల సగటు ఉత్పాదకత పెరిగే కొద్దీ రైతుకు పశుపోషణ లాభసాటిగా మారుతుంది. చేపలు, కోళ్లు, పట్టు, తేనెటీగలు, జీవాల పెంపకం.. ఇలా సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తే అన్నదాతలు సేద్యాన్ని వదలివెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాదు.

దృక్పథం మారాలిక... 
స్వాతంత్య్రానంతరం తొలి పంచవర్ష ప్రణాళిక తరవాత ప్రభుత్వాలకు ప్రాథమ్యాలు మారిపోయాయి. సేద్యరంగంపై శ్రద్ధ కొరవడిన ఫలితమే ఇదంతా! ఏటా బడ్జెట్లలో వ్యవసాయరంగానికి కేటాయింపులు తగ్గుతున్న కొద్దీ పరిశోధనలు మరింత దిగజారాయి. కరవు కాలంలో ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. విపత్తు నష్టాలను కనిష్ఠ స్థాయికి తగ్గించాల్సిన అవసరముంది. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం 10 శాతం కేటాయింపులుండాలి. అత్యధికులు ఆధారపడిన సేద్యరంగానికి సంస్కరణలతో వూపిరులూదాలి. ప్రభుత్వాల దృష్టికోణం మారాలి. మరో హరిత విప్లవం సాధించే దిశగా కార్యాచరణ అమలు కావడం నేడెంతో ముఖ్యం. పంట ఉత్పత్తులు, విలువ జోడింపు ఉత్పత్తులతో వ్యవసాయ వాణిజ్యం బహుముఖీనంగా విస్తరిస్తున్న కొద్దీ మన రైతులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా వారిని కార్యోన్ముఖుల్ని చేయాలి. ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వాలే మద్దతు ధరలిచ్చి రైతులనుంచి నేరుగా పంటను కొనేలా సంస్కరణలు అమలులోకి తేవాలి. నిస్సారమైన నేలలకు జవసత్వాలు కల్పించే కృషి ముమ్మరం కావాలి. ఉత్పత్తుల్ని రెట్టింపు చేసే వంగడాలు గ్రామస్థాయి రైతులకు అందుబాటులోకి రావాలి. సంప్రదాయ పద్ధతులకు ఆధునిక హంగులు అద్దేలా గ్రామీణ రైతుల్ని తీర్చిదిద్దేందుకు విస్తరణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. వీటికితోడు పశుపోషణ తప్పనిసరి వ్యాపకంగా చేపడితే, పంట కోల్పోయినా రైతుల్ని పాడి ఆదుకుంటుంది. దిశగా పాలకులు విస్తృత ప్రచారంతో పాటు డెయిరీ రంగానికి ఇతోధిక తోడ్పాటు అందించాలి. సేద్యంతో పాటు అనుబంధ రంగాలను రైతులు జోడు గుర్రాల్లాగా స్వీకరించిన నాడే వ్యవసాయరంగం మళ్ళీ సిరిసంపదలతో తులతూగుతుంది. రైతు ముంగిళ్లు పాడిపంటలతో, ధాన్యరాశులతో విలసిల్లుతాయి.