రైతు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రైతు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2016, సోమవారం

51 గ్రామాల్లో కరవును తరిమేశాడు!

చిన్నారుల ఆకలి మంటలూ, రైతుల ఆకలి చావులతో ఒకప్పుడు వణికిపోయిన నేల ఇప్పుడు పంట పొలాలతో సుభిక్షంగా వర్థిల్లుతోంది. రోజుకి ఒక్కసారైనా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తే చాలనుకున్న కుటుంబాలు, ఇప్పుడు నాలుగు రాష్ట్రాలకు తమ ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిన 51గ్రామాలు, రాష్ట్రానికి నీటి సంరక్షణ పాఠాలు చెబుతున్నాయి. విజయాలన్నీ ఏడాది పద్మశ్రీ అందుకున్న సైమన్ఒరేన్అనే శ్రామికుడి కష్టానికి దక్కిన ఫలితమే.

నేను పురస్కారాన్ని తీసుకోవాలంటే ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పల్లెల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరించాలి’... తనకు దేశంలోని అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించినప్పుడు సైమన్అన్న మాటలివి. దిల్లీలో పురస్కారం అందుకోవడానికి వచ్చిన ప్రముఖల కోసం ఫైవ్స్టార్హోటల్లో గదులని కేటాయిస్తే, వాటిని వద్దని గిరిజన సంక్షేమ హాస్టల్లో బస చేశాడు సైమన్‌. ‘నా రాష్ట్రంలో రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే, నేను విలాసాలను అనుభవించలేనుఅన్నది ఆయనిచ్చిన సమాధానం. జార్ఖండ్లోని బీడో జిల్లా కక్సిటోలి గ్రామంలో పుట్టిన సైమన్‌, రాష్ట్రపతి భవనం దాకా రావడానికి మధ్యలో మార్చిన జీవితాలూ, సాధించిన విజయాలూ చాలా ఉన్నాయి.

నీటి కష్టాలు మొదలు... 
సైమన్స్వగ్రామం అటవీ ప్రాంతం. చిన్నప్పుడు దళారులు యంత్రాలతో చెట్లను నరుకుతుంటే చూడ్డానికి సైమన్సరదా పడేవాడు. అంత భారీ యంత్రాలు ఒక్క దెబ్బకు చెట్లను నేలకూల్చడం అతడికి ఆశ్చర్యంగా అనిపించేది. కాస్త పెద్దయ్యాక కానీ అతడికి అర్థం కాలేదు, దళారులు నాశనం చేస్తోంది అడవుల్ని కాదు తమ జీవితాల్నీ అని. చెట్లను విపరీతంగా నరికేయడం వల్ల వర్షాలు పడినప్పుడు ప్రాంతంలో నేలపైన సారవంతమైన పైపొర కొట్టుకుపోయి, భూములన్నీ నిస్సారంగా మారాయి. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమైంది. నెమ్మదిగా వలసలూ, ఆకలి చావులూ, ఆత్మహత్యలూ మొదలయ్యాయి. దైవంలా చూసుకునే అడవిలోని చెట్లని కొట్టి అమ్ముకొని గ్రామస్థులు పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. ఇరవై ఎనిమిదేళ్ల వయసులో సైమన్ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. గ్రామంలో అన్ని ఇబ్బందులకూ కారణం నీటి కరవే. వర్షాకాలంలో కురిసే వానలే అక్కడ నీళ్లకు ఆధారం. వాటిని భద్రపరచుకోగలిగితే నీటి కొరతను కొంత వరకూ జయించొచ్చని అనుకున్నాడు

కష్టాలకుచెక్‌’డ్యామ్లు... 
వానాకాలంలో నీటిపాయలు కొండల నుంచి లోతట్టు ప్రాంతాలకు వెళ్లిపోయేవి. సైమన్ నీటిధార ఎక్కడ మొదలవుతుందో తెలుసుకోవడానికి కొన్ని మైళ్ల దూరం నడిచాడు. వర్షపు నీళ్లు అడవిలో, కొండలపైన ఎక్కువగా నిలుస్తోన్న ప్రాంతాలను గుర్తించాడు. వాటి పరిసరాల్లో చెక్డ్యామ్లు నిర్మించి, నీటిని కుంటల్లోకీ, పొలాల్లోకీ మళ్లిస్తే నీటి సమస్య తగ్గుతుంది అనిపించింది. కానీ దానికోసం గ్రామస్థుల పొలాల్లో కొంత భాగం మునిగిపోతుంది. దాంతో చాలామంది డ్యామ్ నిర్మాణానికి ఒప్పుకోకపోవడంతో, సైమన్తన పదెకరాల పొలాన్నీ ముంపు బాధిత రైతులకు ఇచ్చేశాడు. కొందరు కుర్రాళ్ల సాయంతో వర్షపు నీటి ప్రవాహాలకు అడ్డంగా మట్టితో చెక్డ్యామ్లు నిర్మించి నీటిని బావులవైపు మళ్లించాడు. తొలి రెండేళ్లూ వర్షాల ధాటికి డ్యామ్లు కొట్టుకుపోయాయి. దాంతో మూడో ఏడాదికి అధికారుల కాళ్లావేళ్లా పడి కాంక్రీట్డ్యామ్లు నిర్మించాడు. వాటి ఆధారంగా గ్రామ చుట్టుపక్కలున్న బావులూ కుంటల్లోకి వర్షపు నీరు చేరేలా కాల్వలు ఏర్పాటు చేశాడు. కొత్తగా చెరువులు తవ్వించాడు. క్రమంగా భూగర్భ జల మట్టం పెరిగింది. పొలాలు వ్యవసాయానికి అనువుగా మారాయి. విజయం ఇతర గ్రామాలనూ ఆకర్షించి వాళ్లూ సైమన్ను ఆశ్రయించారు. అలా ఒక్కో గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టిన సైమన్‌, కొన్నేళ్ల వ్యవధిలో జిల్లాలోని 51 గ్రామాల్లో నీటి కరవును దూరం చేశాడు.గ్రామాలు మారిపోయాయి 
అడవుల్ని కాపాడుకోకపోతే మనుగడ కష్టమేనని సైమన్కి తెలుసు. అందుకే కుర్రాళ్లను ఏకం చేసి అటవీ సంరక్షణ దళాలను ఏర్పాటు చేశాడు. గతంలో చెట్లను నరికేసిన ప్రాంతంలో 35వేలకు పైగా చెట్లను పెంచడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఫలితంగా నేల సారవంతమైంది. కరవుతో కటకటలాడిన గ్రామాలన్నీ సైమన్పుణ్యమా అని సుభిక్షంగా మారాయి. జార్ఖండ్వ్యాప్తంగా ఏడాదికి సాధారణంగా ఒక పంటే వేస్తే, 51 గ్రామాల్లో మాత్రం నీరు సమృద్ధిగా ఉండటంతో వరితో సహా ఏటా నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి. ఆత్మహత్యలూ, వలసలూ తగ్గి చాలా కాలమైంది. తొలిసారి పిల్లలు మంచి స్కూళ్లకెళ్లి చదువుకుంటున్నారు. గ్రామాల నుంచి లక్షలు విలువ చేసే 20వేల మెట్రిక్టన్నుల కూరగాయలు ఏటా గుజరాత్‌, పశ్చిమబంగా, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో బీడోని అక్కడి ప్రభుత్వంఅగ్రికల్చరల్హబ్ఆఫ్జార్ఖండ్‌’గా గుర్తించింది. సైమన్ను వాటర్షెడ్ల కార్యక్రమానికి బ్రాండ్అంబాసిడర్గా నియమించింది. అతడి ప్రస్థానంపైన సారా అనే కేంబ్రిడ్జి యూనివర్సిటీ విద్యార్థిని పీహెచ్డీ చేసింది. వృద్ధాప్యం మీదపడినా ఇప్పటికీ సైమన్ఏటా వెయ్యి మొక్కలను నాటడంతో పాటు వాటి బాగోగులనూ చూసుకుంటున్నాడు

సైమన్లా ఇబ్బందులు ఎదుర్కొన్నాక పరిష్కారాన్ని వెతుకుతామా, లేక అజాగ్రత్త వల్ల ఎదురయ్యే సమస్యలను ముందే వూహించి వాటిని నివారించడానికి మనవంతుగా ఏదైనా ప్రయత్నం చేస్తామా అన్నది మన చేతుల్లో పనే కదా..!

10, ఆగస్టు 2016, బుధవారం

భూమి పుత్రిక

ఓర్పులో భూమాతను మించిన వాళ్లు లేరు. అలాంటి భూమాత ఒక మహిళకు పరీక్ష పెట్టింది. పరీక్ష చెట్టంత భర్త హఠాన్మరణం. దాంతో కొంగు నడుముకు చుట్టి..  మగవాడిలా తలకు పాగాకట్టి.. ఒంటిచేత్తో అరకపట్టి.. పొలంబాట పట్టింది అనంతపురం జిల్లా గాండ్లపర్తి కొత్తపల్లెకు చెందిన ఉమామహేశ్వరి. జీవితాన్ని పరీక్షకు నిలబెట్టిన భూమాతే.. సేద్యంలో ఆమె ఓర్పును, నేర్పును చూసి ఆశీర్వదించింది.  

ఉమామహేశ్వరి బీఏ పట్టభద్రురాలు. ఒక రైతుతో పెళ్ళయింది. పిల్లలు పుట్టారు. ఇల్లు, భర్త, పిల్లలు.. జీవితం హాయిగా నడిచిపోతోంది. అంతలోనే ఏమైందో ఏమో విధికి కన్నుకుట్టింది. హఠాత్తుగా ఆమె ప్రపంచం తలకిందులైనట్టు.. అంతవరకు తోడున్న భర్త చనిపోయాడు. సేద్యపు పనులన్నీ నెట్టుకొస్తున్న ఆయన.. అర్ధాంతరంగా వెళ్లిపోతే.. ఏం చేయాలి? సేద్యం ఎవరు చేయాలి? కుటుంబాన్ని.. ఇద్దరు ఆడపిల్లలను ఎలా బయటపడేయాలి? చదువు సంధ్యలు, సంసారం.. అప్పులు చుట్టుముట్టాయి. రెండున్నర ఎకరాల పొలం, రెండున్నర లక్షల అప్పు. కంటి ముందు కటిక చీకటి. తండ్రి ధైర్యం చెప్పాడు. ఆసరాగా నిలబడ్డాడు. ఆసరాతో ఆమె పలుగూ పారా చేతబట్టింది. దుఃఖాన్ని దిగమింగింది. కొంగు బిగించి సేద్యం మొదలు పెట్టింది. ద్రాక్ష నాటింది. వ్యవసాయ కుటుంబమే అయినా గడప దాటకుండా పెరిగిన ఉమామహేశ్వరి తొలుత ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఒకవైపు ప్రతికూలంగా ఉండే ప్రకృతి, తెగుళ్ల ముట్టడితో దెబ్బతినే ద్రాక్ష తోట. మరోవైపు బిడ్డల చదువుల ఖర్చు. గృహిణిగా ఇంటిని చక్కదిద్దుకున్న నైపుణ్యమే ఆమెకు వ్యవసాయంలోనూ ఉపయోగపడింది. వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబంలో ఎదుర్కొన్న సంక్షోభాలకన్నా కష్టమైనవిగా ఆమెకు అనిపించలేదు. పిల్లల్ని పెంచినంత ప్రేమగా ద్రాక్ష తీగలనూ చూసుకుంటోంది. పిల్లలకు అనారోగ్యమొస్తే తల్లడిల్లినట్లే ద్రాక్ష తీగకు తెగలు సోకినపుడూ ఆందోళనపడుతుంది. ఇతర రైతుల అనుభవం నుంచి ఎన్నో నేర్చుకుంది

అప్పులు తీర్చి.. పిల్లల్ని గట్టెక్కించి..
ద్రాక్ష సాగు మొదలు పెట్టిన రెండేళ్లకే భర్త చేసిన అప్పు తీర్చేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. పిల్లల చదువు కోసం ఏడాదికి అయిదారు లక్షల ఖర్చు ఇప్పుడామెకు భారంగా లేదు. పెద్దమ్మాయి పద్మజ బెంగుళూరులో ఫైనలియర్బీటెక్చదువుతోంది. రెండో కూతురు సాయిశ్రీ హైదరాబాద్లో సివిల్స్అకాడమీలో చదువుతోంది. ‘ఆమె కలెక్టరై మాలాంటి కుటుంబాలకు ఆసరాగా నిలవాలనేది నా కలఅంటారు ఉమామహేశ్వరి. ‘ద్రాక్ష సాగు భలే కష్టం. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఉదయం సాయంత్రం పంటను గమనిస్తుండాలి. వాతావరణం మారినప్పుడల్లా పంటకు చీడపీడలు ఆశిస్తుంటాయి. ఆకులకు, కొమ్మలకు, పూతకు తెగులు కనిపిస్తే, ఆరోజే మందులు పిచికారీ చేయాలి. శ్రద్ధగా చేస్తే ద్రాక్ష సాగుతో లక్షలు వస్తాయిఅంటుందామె. కేవలం రెండున్నర ఎకరాల ద్రాక్ష సాగులో ఏడాదికి 15 లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. వ్యవసాయ ఖర్చులు అయిదారు లక్షలు పోను పదిలక్షలు మిగులుతాయి. ‘‘మొదట్లో కూలీలు దొరకడం పెద్ద సమస్యగా ఉండేది. మందుల పిచికారీకి మనుషులు తప్పనిసరి. కానీ సమయానికి దొరికేవాళ్ళు కాదు. తర్వాత మినీట్రాక్టర్కొని నడుపుతున్నాను. దానితోనే మందులు స్ర్పే చేయవచ్చు. బుల్లి ట్రాక్టర్రాకతో నాకు వ్యవసాయం ఎంతో తేలికైందిఅని వ్యసాయంలోని కష్టసుఖాలను వివరించింది ఉమ. ‘జీవితం ఇక ముగిసిపోయిందనుకున్న సమయంలో మా నాన్న కుమారస్వామి నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చదువుకుంటున్న నా పిల్లలు నాకు పెద్ద ఆసరా. వ్యవసాయ పనుల్లో సహకరిస్తుంటారు. వాళ్లు ట్రాక్టరుతో సేద్యపు పనులు చేయడం నాకంటే బాగా నేర్చుకున్నారుఅంటుంది ఉమ

తోటి రైతులకు ఆదర్శం
ఉమామహేశ్వరి శ్రద్ధగా చేసే ద్రాక్ష సేద్యంలో పండుతున్న లక్షలు చూసి చుట్టుపక్కల ఎందరో రైతులు ద్రాక్ష సాగు మొదలు పెట్టారు. వారికి ఈమె సలహాలు కూడా ఇస్తుంటారు. ఉమామహేశ్వరి మరిది రామాంజనేయులు రైల్వే ఉద్యోగం మానేసి మరీ ద్రాక్ష సాగు మొదలు పెట్టాడు. చెల్లెలు వైశాలి కూడా అక్క బాటలో సేద్యం చేస్తోంది. అనంతపురంలో బేకరీ నడుపుకునే ఒక వ్యాపారి కూడా ఉమామహేశ్వరి సేద్యం చూసి ద్రాక్ష రైతుగా మారారు. ‘జిల్లాలో సీడ్లెస్ద్రాక్ష సాగును మొదట నేనే చేశాను. కిలో ద్రాక్ష రూ.49కి తోటలోనే విక్రయించాను. రూ.34కు తక్కువ ఎప్పుడూ అమ్మలేదు. ద్రాక్ష నా కుటుంబాన్ని కాపాడిందిఅని కృతజ్ఞతగా చెబుతుంది ఉమామహేశ్వరి. జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో చేస్తే వ్యవసాయంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితే ఉండదన్నది ఆమె ఇస్తున్న భరోసా. ‘అప్పులున్నాయని ఆత్మహత్యలు చేసుకోవడం పిరికి పని. సేద్యం వదిలేస్తే అప్పులు పెరగక ఇంకేం పెరుగుతాయ్‌. ముందు రైతు బద్ధకాన్ని వదిలేయాలి. చేలో పంటేసి సిటీల్లో తిరగడం మానాలి. చేలోని పంటను ప్రాణంగా చూసుకోవాలి. జాగ్రత్తగా సాగుచేస్తే సాఫ్ట్వేర్ఉద్యోగి జీతంకన్నా ఎక్కువ ఆదాయం సాధించవచ్చుఅని ఒక మహిళా రైతుగా పద్నాలుగేళ్ల అనుభవంతో చెబుతోందామె
[అనంతపురం]